AMARAVATHI

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం..

అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు ఎత్తి వేసింది…5 సంవత్సరాలను వైసీపీ వృథా చేసింది.. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటల తూటాలు పేల్చారు.. ఏపీలో అభివృద్ధి శూన్యం..అవినీతిలో నెంబర్‌వన్‌ అంటూ తీవ్ర స్థాయిలో విరుకుపడ్డారు.. సోమవారం రాజమండ్రిలోని వేమగిరి నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్,,లోకేష్ లు పాల్గొన్నారు..ఈ సందర్భంగా ప్రధాని మోదీ, పలు కీలక వ్యాఖ్యలు చేశారు..10 సంవత్సరాల యూపీఏ పాలన అంతా స్కామ్‌ల మయమని విమర్శించారు.. ఎన్డీఏ పాలన వస్తేనే ఆంద్రప్రదేశ్ లో అభివృద్ధి సాధ్యమన్నారు..అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తామని ప్రధాని హెచ్చరించారు..వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిందని,, అయితే ఇప్పుడు ప్రభుత్వమే లిక్కర్‌ వ్యాపారం చేస్తోందంటూ నిశితంగా విమర్శించారు..ఆంద్రప్రదేశ్ లో మద్యం మాఫియా, ఇసుక మాఫియాల రాజ్యం నడుస్తోందని,,అవినీతిలో దూసుకుని పోతున్న వైసీపీ ప్రభుత్వం,, అభివృద్ధిలో మాత్రం వెనుక పడిపోయిందన్నారు..మూడు రాజధానులు నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఒక్క రాజధాని కూడా ఇవ్వలేదన్నారు..మూడు రాజధానుల పేరిట దొపిడీ చేద్దామనుకున్నారని,, కానీ ఖజానా ఖాళీ అయిందంటూ వ్యాఖ్యనించారు..అవినీతికి పాల్పపడడంలో ముందు వున్న వీళ్లు ఆర్ధిక నిర్వహణ మాత్రం చేయలేరంటూ విమర్శించారు..ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుకు బ్రేకులు వేశారంటూ మండిపడ్డారు..కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం 15వేల కోట్లు ఇచ్చిందని కానీ రాష్ట్రప్రభుత్వం ముందుకు వెళ్లనివ్వడంలేదన్నారు..జూన్‌ 4 తరువాత ఎన్డీఏ ప్రభుత్వం ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తుందని,, ఎన్డీఏ పాలనతోనే అభివృద్ధి సాధ్యం అని పేర్కొన్నారు..

జార్ఖండ్ లో నోట్ల గుట్టలు:- జార్ఖండ్ లోని ఓ మంత్రి ఇంట్లో లభించిన నగదుపై కూడా ప్రధాని మోదీ మాట్లాడుతూ పక్క రాష్ట్రమైన జార్ఖండ్‌లో నోట్ల గుట్టలు బయటపడ్డాయని,, అక్కడ దొంగసొత్తును మోదీ పట్టుకుంటున్నారని జనం అంటున్నారన్నారు.. ఈ దొంగతనాన్ని, అక్రమ సంపాదనను, దోపిడీని బట్టబయలు చేస్తే,, నా పైన దుమ్మెత్తి పోస్తారని,,ఎవరేమి అనుకున్నా,, దొంగ సొమ్మును మాత్రం బయటకు తీస్తామన్నారు..కేంద్రం ప్రజలకు పంపిన ఒక్క పైసా కూడా ఎవరినీ తిననివ్వను అని అ సోమ్ము పేదలకు చేరాల్సిందే అని అన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

14 hours ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

16 hours ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

16 hours ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

21 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

2 days ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

2 days ago

This website uses cookies.