నెల్లూరు: జిల్లాలో మార్చి 13వ తేదీన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శక సూత్రాల ప్రకారం నగదు, మద్యం తరలింపు, ఇతర వస్తువుల పంపిణీ పై పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను (FST) ఏర్పాటు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు డివిజన్ల వారీగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. ఈ బృందాలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. అలాగే మద్యం, నగదు, ఇతర వస్తువుల తరలింపు, పంపిణీ పై అందిన ఫిర్యాదులను నమోదు చేసి, సరైన ఆధార పత్రములు లేని నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసే అధికారం ఈ బృందాలు కలిగి ఉంటాయి. ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అంశాలపై గట్టిగా నిఘా ఉంచి, ఎవరైనా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు జిల్లా ఎన్నికల అధికారికి ఈ బృందాలు సిఫార్సు చేస్తాయి.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.