అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు జిల్లాలో భారీ వర్షం పడింది..వర్షంతో పాటు పిడుగు పడడంతో ఏలూరు జిల్లాలోని లింగపాలెం మండలం యడవల్లి గ్రామానికి చెందిన పరస రామారావు (41) పశువులను మేపడం కోసం పొలంలో ఉండగా మరణించారు..పిడుగు పాటుకు పశువులు సైతం మృతిచెందినట్లు తెలుస్తోంది.. జిల్లాలోని ముసునూరు మండలంలో ఈదురుగాలులకు వందల ఎకరాల్లో అరటిపంట నేలకూలింది.. పిడుగు పాటుతో తల్లి కూతుళ్ల మృతి:- గుడివాడలో కూడా గాలివాన బీభత్సం సృష్టించింది.. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడగా, భారీ వృక్షాలు నేలకొరిగాయి.. పల్నాడు జిల్లాలోని క్రోసూరు మండలం ఊటుకూరులో పిడుగుపాటుకు తల్లి, కూతుళ్లు మృతి చెందారు..పొలం నుంచి ఇంటికి వస్తుండగా పిడుగు పడటంతో బొందల నాగేంద్రం (52), యండ్రపల్లి నాగరాణి (25) మృతి చెందారు..అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకూలాయి..పొలంలో ఉన్న ధాన్యం తడిసి ముద్దాయింది..దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో భారీ హోర్డింగులు వర్షం ధాటికి కిందపడ్డాయి..విజయవాడ, గుంటూరు నగరాల్లో వర్షంతో ట్రాఫిక్ ‘ఎక్కడికక్కడ స్థంభించిపోయింది.
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
This website uses cookies.