AMARAVATHI

“ప్రధాన మంత్రి స్వనిధి” పథకంతో చిరు వ్యాపారులకు చేయూత- కమిషనర్ వికాస్ మర్మత్

నెల్లూరు: వీధి వ్యాపారులు, చిరు వర్తకుల కుటుంబాలకు ఆర్ధిక సంక్షేమం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పి.ఎమ్ స్వనిధి పధకం ఎంతగానో చేయూతను అందిస్తుందని కమిషనర్ వికాస్ మర్మత్ అన్నారు..మెప్మా విభాగం ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ చిరు వ్యాపారుల ఆర్ధిక ప్రగతికోసం రూపొందించిన ఈ పధకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని, బకాయి మొత్తాలను సకాలంలో తిరిగి చెల్లించి మరింత మొత్తంలో రుణాలు పొందేందుకు అర్హతలు సాధించాలని సూచించారు. 10 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల మొత్తం రుణాన్ని మూడు సంవత్సరాల కాలంలో చెల్లించేలా పధకంలో వెసులుబాటు కల్పించారని కమిషనర్ వెల్లడించారు. నగర పాలక సంస్థ పరిధిలోని వీధి వర్తకులు, చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వర్తకులు తమ వ్యాపారాలకు అవసరమైన పెట్టుబడి మొత్తాలను అధిక వడ్డీలకు వడ్డీ వ్యాపారస్తుల వద్ద తీసుకుని, చెల్లింపుల సమయంలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంపై ప్రజలకు అవగాహన పెంచాలని కమిషనర్ సూచించారు.అనంతరం రుణాల చెల్లింపులో నిబద్ధత పాటించి, అధిక రుణాల మంజూరుకు అర్హత సాధించిన లబ్ధిదారులకు, మొత్తాలు మంజూరు చేయడంలో ప్రతిభ కనబర్చిన మెప్మా సిబ్బందిని కమిషనర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పి.డి రవీంద్ర, ఎల్.డి.ఎమ్ ప్రదీప్ కుమార్, సి.ఎమ్.ఎమ్ పెంచలయ్య, జరీనా తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

1 hour ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

5 hours ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

10 hours ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

1 day ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

1 day ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

1 day ago

This website uses cookies.