AMARAVATHI

ఎన్ని రకల సవాళ్లైనా ఎదుర్కోవడం ఇష్టపడుతాను-ప్రధాని నరేంద్ర మోదీ

అమరావతి: లోక్ సభలో జరుగుతున్న బడ్జెట్ సెషన్ లో శనివారం అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది..చర్చలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఐదేళ్ల ప్రభుత్వం దేశంలో సంస్కరణలు, పనితీరు, పరివర్తనతో కూడినదని అన్నారు..17వ లోక్ సభను యావత్ దేశం ఆశీర్వదించనుందని,, అలాగే కొందరు సవాళ్లను చూసి భయపడి పారిపోతారని,,తనకు ఎన్ని సవాళ్లైనా ఎదుర్కోవడం ఇష్టమన్నారు.. రామమందిరం తీర్మానంపై సమాధానం ఇవ్వడం గర్వంగా భావిస్తున్నానని ఎంపీల జైశ్రీరాం నినాదాల మధ్య మోదీ స్పష్టం చేశారు.. 17వ లోక్ సభ కొత్త బెంచ్ మార్క్ లను సృష్టించిందని,ఇదే సమయంలో మన రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు కూడా ఈ కాలంలోనే పూర్తయ్యాయన్నారు.. ఈ హయాంలో అనేక సంస్కరణలు చోటుచేసుకోవడంతో, గేమ్ ఛేంజర్ 21వ శతాబ్దపు బలమైన పునాది ఆ విషయాలన్నింటిలో కనిపిస్తుందని తెలిపారు.. రాజ్యాంగం కోసం ఎన్నో తరాలు కలలు కంటున్నాయని, అయితే ప్రతి క్షణం అడ్డంకులు ఎదురవుతున్నాయని వెల్లడించారు.. అయితే ఈ సభ ఆర్టికల్ 370ని తొలగించి రాజ్యాంగానికి పూర్తి స్వరూపాన్ని వెల్లడించిందని, రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుల ఆత్మలు మనల్ని ఆశీర్వదించాలని అన్నారు.. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏకంగా పార్లమెంటు సమావేశాలు సైతం నిర్వహించిన ఘనత స్పీకర్ కు దక్కుతుందన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

12 hours ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

13 hours ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

14 hours ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

16 hours ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

17 hours ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

1 day ago

This website uses cookies.