నెల్లూరు: అసంఘటిత రంగ కార్మికులు, చిరు వ్యాపారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ పింఛన్ పథకంపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేయాలని జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ పిలుపునిచ్చారు..శనివారం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ (PMSYM) పింఛన్ పథకంపై వర్క్ షాప్ నిర్వహించారు..జడ్పీ సీఈవో శ్రీమతి వాణి మాట్లాడుతూ ఆజాది సే అంత్యోదయ తక్ 90 రోజుల కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 75 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని, అందులో మన రాష్ట్రం నుంచి నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలు ఉన్నాయన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా నూతనంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పింఛన్ పథకాన్ని జిల్లాలో 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల చిరు వ్యాపారులు, ఆశా, అంగన్వాడి కార్యకర్తలు, ఉపాధి హామీ, వ్యవసాయ కూలీలు, డ్రైవర్లు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళలు మొదలైన అసంఘటిత రంగంలోని కార్మికులు వినియోగించుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. లబ్ధిదారుని వయస్సును బట్టి ప్రతి నెలా రు.55 నుండి రు.200 వరకు బ్యాంకు అకౌంట్ ద్వారా చెల్లిస్తే 60 ఏళ్లు దాటిన తర్వాత వారికి రూ.3000కు తగ్గకుండా పింఛన్ ను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. అన్ని కామన్ సర్వీస్ సెంటర్లు, సచివాలయాల్లో లబ్ధిదారులు ఆధార్, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ తీసుకెళ్లి ఈ పథకం కింద రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నారు. ఈ పథకం ద్వారా అనేక ప్రయోజనాలు, ప్రతి ఒక్కరూ వృద్ధాప్యంలో ఎంతో భరోసాగా నిలిచే పింఛన్ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు..ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విచ్చేసిన అనేకమంది అసంఘటిత రంగ కార్మికులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి, గుర్తింపు కార్డులను అందజేశారు.
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.