AMARAVATHI

నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పేందుకు ఎలాంటి భయం లేదు-చిరంజీవి

హైదరాబాద్: తాను క్యాన్సర్ బారినపడ్డానని, ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం వల్లే తాను బతికాను అని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు..శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు..స్టార్ హాస్పిటల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ వచ్చిందని చెప్పేందుకు ఎలాంటి భయం లేదని,, ఏఐజీలో కొలనోస్కోపీ చేయించుకొని క్యాన్సర్ నుంచి బయటపడ్డానన్నారు..‘తాను ఆరోగ్యంగా ఉంటానని అనుకుంటానని, రోజు ఎక్సైర్ సైజ్ చేస్తుంటానని, హెల్తీఫుడ్, ఫైబర్ ఫుడ్ తీసుకుంటాను, నాకు న్యూట్రిషనిస్ట్ ఉంటాడు కాబట్టి నాకు ఏ జబ్బురాదులే అనుకున్నాను తెలిపారు..అలాగే నాకు ఏ చెడు ఆలవాట్లు లేవు… ఎప్పుడో స్నేహితులతో కలసి వైన్ తీసుకుంటాను…స్మోకింగ్ అలవాట్లు లేవు…దింతో ఎలాంటి క్యాన్సర్ రాదు అనుకోవడానికి లేదన్నారు..అలాంటి నేను ఏఐజీ హాస్పిటల్లో క్యాన్సర్స్ కు చికిత్స తీసుకున్నాను అని చెప్పారు.. 45 సంవత్సరాలు దాటిన తరువాత కొలన్ క్యాన్సర్ తో బాధపడ్డాను… స్టేజ్-4 మాత్రమే దీన్ని గుర్తించే అవకాశం ఉంది… ఏఐజీ వెళ్లి డాక్టర్ నాగేశ్వర్ రావును కలిశాను…పరీక్షల్లో పాలిప్స్ బయటపడ్డాయి…వెంటనే చికిత్స చేసి వాటిని తొలగించారు…క్యాన్సర్ పై అవగాహన లేకపోయి ఉన్నా…మనకు రాదులే అని మనపై మనకు నమ్మకం, నిర్లక్ష్య భావన ఉంటే.. ఒకటి రెండు సంవత్సరాల తర్వాత నా పరిస్థితి ఎలా ఉండేదో ఉహించుకుంటే భయం వేసిందన్నారు… అభిమానుల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తానన్నారు…హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తానన్నారు…క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టుల కోసం స్టార్ హాస్పిటల్ తో మాట్లాడానన్నారు…జీనోమిక్స్ టెస్టుతో ముందస్తుగానే క్యాన్సర్ ను గుర్తించవచ్చని,,క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తానన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

14 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

14 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

19 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.