అమరావతి: ఒడిశాలోని బాలాసోర్ లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాద సంఘటన స్థలానికి శనివారం మధ్యహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకుని పరిశీలించారు..ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూన్న క్షతగాత్రులను పరామర్శించారు.అనంతరం ప్రధాని మీడియాతో మాట్లాడుతూ రైలు ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు..ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని,, ప్రమాదానికి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.. రైలు ప్రమాదం చాలా దురదృష్టకరమని,,ఈ ఘటనలో చాలా రాష్ట్రాల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు..మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు..సహాయక చర్యల్లో ఒడిశా ప్రభుత్వం అన్ని విధాల సహకరించిందని ప్రధాని తెలిపారు..క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ప్రధాని మోడీ అదేశించారు..ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి రక్తదానం చేసిన స్థానికులకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు..ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది..మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు,,తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది.
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.