AMARAVATHI

ఏ.పి సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నియామకాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నియామకాలపై హైకోర్టు కీలక అదేశాలు ఇచ్చింది.. అభ్యర్థుల ఎత్తు కొలిచే విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ పరీక్షలకు హాజరు అయిన అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.. గతంలో రిజర్వ్ సబ్ ఇన్స్ పెక్టర్ గా పని చేసిన వ్యక్తిని కూడా ఎత్తు సరిపోలేదంటూ తిరస్కరించారని పిటీషనర్ తరపు న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆఫీడివిట్ దాఖలు చేశారు.. గతంలో అభ్యర్థులందరి ఎత్తు తన సమక్షంలోనే తీసుకుంటామంటూ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పిటీషనర్లందరూ సిద్ధంగా ఉన్నారని న్యాయవాది హైకోర్టుకు వివరించారు..2019లో ఎత్తు విషయంలో క్వాలిఫై అయిన అభ్యర్థులు 2023లో అనర్హత సాధించడంపై గతంలో హైకోర్టులో వాదనలు జరిగాయని,, పూర్తి స్థాయి విచారణ తరువాత ఎస్ఐ ఫలితాలు నిలుపుదల చేయాలి అంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చిందని అడ్వకేట్ తెలిపారు..సదరు ఉత్తర్వులను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ కు రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేసింది..అభ్యర్థులు ఎత్తు విషయంలో తామే నిర్ణయం తీసుకుంటామని,,పిటిషనర్లు అందరూ సోమవారం కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

14 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

14 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

19 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

1 day ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.