అమరావతి: దేశంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది..వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడంలో భాగంగా మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందించే పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది..2023-24 నుంచి 2025-26 మధ్యకాలంలో 15,000 స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందివ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది..అలాగే రైతులకు అద్దె పద్ధతిలో డ్రోన్లను అందించి యువత ఉపాధి పొందేలా పథకాన్ని రూపొందించారు..ఈ పథకం ఆమలు కోసం రూ.1,261 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.. పథకం కింద గరిష్టంగా 8 లక్షల రూపాయల మేర 80% ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందించనుంది..లబ్దిదారులకు 5 రోజుల పాటు డ్రోన్ పైలట్ శిక్షణ,,అటు తరువాత మరో 10 రోజుల పాటు డ్రోన్ల ద్వారా వ్యవసాయ సేవలపై శిక్షణ ఇస్తారు..2023-24 రబీ సీజన్ కోసం ఫాస్పేట్, పొటాష్ ఎరువులపై సబ్సీడీకి కేంద్రం ఆమోదం తెలిపింది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వంపై సబ్సిడీ భారం 22,303 కోట్ల రూపాయలు పడనుంది..
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంను 2024 జనవరి 1 నుంచి 5 సంవత్సరాల పాటు పొడగించారు.. పథకం కింద దేశంలో దాదాపు 81 కోట్ల మందికి లబ్ది చేకూరనుంది..ఐదేళ్లలో ఈ పథకం ఆమలతో కేంద్ర ప్రభుత్వంపై 11.80 లక్షల కోట్ల రూపాయల భారం పడనుంది.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.