అమరావతి: ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన దేశాల కూటమిగా నిలిచిన G-20 శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని ఇంద్రప్రస్థ సుందరంగా ముస్తాబైంది..శని,ఆదివారల్లో జరిగే శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి..అంతర్జాతీయ ఆర్థిక అంశాలతో పాటు ప్రపంచీకరణ అనే ఆంశం బలోపేతం అయ్యేందుకు G-20 దేశాల కూటమి కీలక పాత్ర పోషించనున్నది.. ప్రపంచ దేశాల ఆర్థిక సహకారానికి కీలక వేదికగా నిలిచే G-20 దేశాలు ప్రతిష్ఠాత్మక నిర్వహించే సదస్సుకు తొలిసారి విశ్వగురూ భారత్ ఆతిథ్యమిస్తోంది..అతిథుల భద్రత నుంచి ఆతిథ్యం వరకు అన్నింటిని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది..ప్రగతి మైదాన్ లో నూతనంగా నిర్మించిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ & ఎగ్జిబిషన్ సెంటర్ లో ఉన్న భారత్ మండపంలో శిఖరాగ్ర సదస్సు జరగనుంది..ఈ మండపాన్ని లైటింగ్స్, వివిధ కళా అకృతుల పెయింటింగ్స్ తో అలంకరించారు..మండప ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన నటరాజ విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది..భారతీయ సంస్కృతిని చాటిచెప్పేలా ఓ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు..G-20 దేశాల సమావేశం ఒకవైపు,,,సదస్సు నిర్వహణ సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు మరోవైపు..దేశ రాజధాని ఇప్పుడు కనీవినీ ఎరుగని భద్రతా వలయంలోకి వెళ్లింది..కీలక ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ బలగాలు, స్పెషల్ ఫోర్సులు, సైన్యం, నిఘా విభాగం ఢిల్లీని పహరా కాస్తున్నాయి..G-20 సదస్సులో భాగంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సమావేశం కానున్నారు..ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై నేతలు చర్చించనున్నారు.. రెండు రోజులపాటు జరిగే G-20 సదస్సు కోసం ఇప్పటికే అమెరికా నుంచి బయలుదేరిన బైడెన్ సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోనున్నారు..G 20 సదస్సు కోసం భారత్ వచ్చే తొలి అతిథిగా బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ నిలవనున్నారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.