DISTRICTS

డీగ్రీ ఆర్ట్స్ కోర్సులలో ఇంటర్న్షిప్ ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది-జె.సి కూర్మనాథ్

నెల్లూరు: ఆర్ట్స్ కోర్సులలో ఇంటర్న్షిప్ అనే నూతన ఒరవడికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జాయింట్ కలెక్టర్  రోణంకి కూర్మనాథ్ పేర్కోన్నారు.గురువారం కలెక్టరేట్లోని S.R.శంకరన్ హాల్లో డిగ్రీ కళాశాలల్లో ఇంటర్న్షిప్ ప్రవేశ పెట్టే విధానంపై ఎంపిక చేసిన జిల్లాస్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సంధర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క డిగ్రీ కళాశాల విద్యార్థి తమ కోర్సులో భాగంగా ఇంటర్న్షిప్ ఖచ్చితంగా చేయవలసి ఉంటుందన్నారు. వివిధ రంగాలకు అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగ పడుతుందన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడి నిరుద్యోగం తగ్గుతుందన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని ఇటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఈనెల 14  తేదీన లాంఛనంగా ప్రారంభిస్తున్నారన్నారు. జిల్లాలోని 49 డిగ్రీ కళాశాలల్లో చదివే 9221 మంది విద్యార్థులకు వారు చదివే సబ్జెక్ట్ లో ఇంటర్న్షిప్ చేసేందుకు పరిశ్రమలను గుర్తించాలన్నారు. ఈనెల 10వ తేదీ లోపు ఆయా రంగాలను గుర్తించి విద్యార్థులు ఎంచుకునేందుకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాల్సిందిగా అధికారులకు సూచించారు. సిద్ధాంతపరమైన చదువుతో పాటు నైపుణ్యాలను అందిపుచ్చుకునే అవకాశం విద్యార్థులకు కలుగుతుందన్నారు.అదే సమయంలో పరిశ్రమ వర్గాల వారికి మానవ వనరుల సౌలభ్యం దొరుకుతుందన్నారు. ఆయా రంగాలకు సంబంధించిన వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సమావేశంలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రిజిస్టర్ డాక్టర్ రామచంద్రారెడ్డి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వినీల్ కుమార్, డి ఆర్ డి ఎ  పి డి సాంబశివ రెడ్డి, ఎల్ డి ఎం శ్రీకాంత్ ప్రదీప్, డి ఎం హెచ్ ఓ పెంచలయ్య, పశుసంవర్ధక శాఖ జె.డి మహేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

2 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

2 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

24 hours ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

1 day ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

1 day ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

1 day ago

This website uses cookies.