AMARAVATHI

జగన్ నాలుగేళ్ల పాలన అంతా అవినీతిమయమ-అమిత్ షా

మోదీ ఇస్తున్న పథకాలకు జగన్ పేరు పెట్టకుంటారా?
అమరావతి: ముఖ్యమంత్రిగా జగన్ నాలుగేళ్ల పాలన అంతా అవినీతిమయమని,,ఏ.పి మైనింగ్, మాఫియా, గంజాయికి అడ్డాగా మారిందని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు..శనివారం ప్రధాని నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా విశాఖలోని రైల్వేగ్రౌండ్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ అమిత్ షా మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడోస్థానంలో ఉందని విమర్శలు చేశారు..అన్నదాతల ఆత్మహత్యలు ఆడ్డుకొలేని ముఖ్యమంత్రి సిగ్గుపడాలన్నారు.. కేంద్రం ఇస్తున్న ఇళ్లకు జగన్ పేరు పెట్టుకున్నారని అలాగే ప్రధాని మోదీ ఇస్తున్న ఉచిత బియ్యం పథకానికి కూడా జగన్ ఫొటో పెట్టుకుంటున్నరని దుయ్యబట్టారు..వైసీపీ వచ్చాక విశాఖ నగరం అరాచక శక్తులకు అడ్డాగా మారిందని మండిపడ్డారు..పదేళ్లలో ఏపీ అభివృద్ధికి రూ.5 లక్షల కోట్లు ఇచ్చామని,,అమరావతి, విశాఖ, కాకినాడ, తిరుపతిని స్మార్ట్ సిటీలు చేస్తున్నామని అమిత్ షా ప్రకటించారు..
కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగింది… మోదీ 9 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగిన ఒక్క అవినీతి ఆరోపణపైనా చర్యలు తీసుకోలేదని చెప్పారు.. పుల్వామా దాడి ఘటన జరిగిన 10 రోజుల్లోనే సర్జికల్ స్ట్రయిక్స్ ద్వారా పాక్ కు బుద్ధి చెప్పామన్నారు.. 70 కోట్ల మంది పేదలకు అనేక పథకాలు అమలు చేయడంతో పాటు రైతులకు ఏటా రూ.6 వేలు సాయం అందిస్తున్నమన్నారు.. కేంద్ర పథకాలకు జగన్ తన పేరు చెప్పుకుంటున్నారు. ప్రపంచంలోని అనేక వేదికలపైన భారతదేశ ప్రతిష్ఠను ప్రధాని మోదీ పెంచారని,,ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోదీ పేరునే పలుకుతున్నాయన్నారు..ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత దేశ రక్షణ వ్యవస్థ బలోపేతం అయిందని హోం మంత్రి చెప్పారు..

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

1 hour ago

ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అనుమతి- కలెక్టర్‌

బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…

1 hour ago

4వ దశలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో సీఈసీ

తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…

4 hours ago

అన్ని మాఫియాలకూ పక్కా గుణపాఠం తప్పదు-ప్రధాని మోదీ

అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…

4 hours ago

భారతదేశంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా

అమరావతి: ఇండియన్ ఓవర్సీస్‌ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్‌గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…

5 hours ago

ఎన్నికల విధులకు వెళ్లే వారి కోసం అన్ని బస్టాండ్ల నుంచి 255 బస్సులు-కలెక్టర్

బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ విధులు కేటాయించబడిన పోలింగ్‌ అధికారులు,…

5 hours ago

This website uses cookies.