DISTRICTS

కుప్పంలో సొంత ఇల్లు లేదు కాని హైదరాబాద్ లో ఇంద్రభవనంలాంటి ఇల్లు కట్టుకున్నాడు-సీ.ఎం జగన్

చిత్తూరు: మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో దాదాపు 33 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు పనిచేశారని, అలాంటి వ్యక్తి కుప్పం నుంచి తనకు కావాల్సింది తీసుకున్నాడే తప్ప చేసింది ఏమిలేదని ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు..శుక్రవారం కుప్పం నియోజకవర్గంలోని అనిమిగానిపల్లి బహిరంగ సభలో మూడో విడత వైఎస్ఆర్ చేయూత నిధులను సీ.ఎం జగన్ విడుదల చేశారు. అనంతరం సీ.ఎం మాట్లాడుతూ, నాలుగు పథకాల ద్వారా రాష్ట్రంలోని మహిళలకు రూ.51వేల కోట్లు ఇచ్చామని, ఈ మూడు సంవత్సరాల్లో మహిళలకు రూ.1.17 లక్షల కోట్లు అందించామన్నారు. వచ్చే సంవత్సరం జనవరి నుంచి పింఛన్ ను రూ.2,750కి పెంచుతున్నామని తెలిపారు..కుప్పంను చంద్రబాబు ఏనాడూ సొంతగడ్డగా భావించలేదని, హైదరాబాదే ముద్దు అని భావించాడని జగన్ విమర్శించారు. అందుకే సీఎం అయ్యాక హైదరాబాద్ లో ఇంద్రభవనంలాంటి ఇల్లు కట్టుకున్నాడని, కుప్పంలో సొంత ఇల్లు కాదు కదా….ఓటు కూడా లేదని,,చంద్రబాబు హైదరాబాద్ కు లోకల్,, కుప్పంకు నాన్ లోకల్ అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంగా ఉండికూడా తన సొంత నియోజకవర్గంలో కరువు సమస్యకు పరిష్కారం చూపించలేక పోయాడంటూ మండిపడ్డారు..కుప్పానికి ఏమీ చేయలేని చేతకాని నాయకుడు చంద్రబాబు అంటూ జగన్ విమర్శించారు..2019 ఎన్నికల తర్వాత అన్ని ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేశామని, కుప్పం ప్రజలు బాబు అవినీతికి వ్యతిరేకంగా ఓటేశారని అన్నారు.వైసీపీ హయాంలో కుప్పాన్ని మున్సిపాలిటీ చేశామని, ఆరు నెలల్లో హాంద్రీనీవా పనులు పూర్తిచేశామని, ఈ ప్రాంత ప్రజలకు కలగా మిగిలిన ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.. ఈ మూడు సంవత్సరాల్లో కుప్పం నిజమైన అభివృద్ధిని చూసిందని, ఎమ్మెల్సీగా ఉంటూనే భరత్, నాచేత ఇన్ని మంచి పనులు చేయించాడని, భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ జగన్ చెప్పారు.

Spread the love
venkat seelam

Recent Posts

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

54 mins ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

1 hour ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

5 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

20 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

1 day ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

2 days ago

This website uses cookies.