అమరావతి: రిలయన్స్ జియో వినాయక చవితి సందర్భంగా మంగళవారం జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber) సర్వీస్ ను రిలయన్స్ జియో ఇన్పోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ లాంఛనంగా ప్రారంభించాడు..గత నెల 28వ తేదిన జరిగిన రిలయన్స్ వార్షిక వాటాదారుల సమావేశంలో జియో ఎయిర్ ఫైబర్ తీసుకొస్తున్నట్లు రిలయన్స్ ప్రకటించింది..తొలుత దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్ కతా, పుణె నగరాల్లో Jio Air Fiber సేవలు అందుబాటులో ఉంటాయి.. Installations చార్జీల కింద రూ.1000 చెల్లించాలి.. జియో అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి Connection తీసుకోవాలి అనుకునే వారు రూ.100 పే చేసి జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber) బుక్ చేసుకోవచ్చు..మిగిలిన మొత్తం బిల్లులో సర్దుబాటు చేస్తారు..జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber) కనెక్షన్ తోపాటు లేటెస్ట్ వై-ఫై రూటర్, టీవీ అండ్ వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్ కోసం 4కే సెట్ టాప్ బాక్స్ ఇస్తారు..అన్ని రకాల ప్లాన్లు ఆరు నెలలు,,12 నెలల ఆప్షన్లలో లభిస్తాయి..ఒకవేళ మీరు 12 నెలల ప్లాన్ ఎంచుకుంటే రూ.1000 Installations చార్జీలో పూర్తి రాయితీ ఇస్తారు,,దేశంలో ఏ ప్రాంతంలోనైనా జియో ఎయిర్ ఫైబర్ పోర్టబిలిటీ లభిస్తుంది..కానీ ఆ ప్రాంతంలో 5జీ కనెక్టివిటీ ఉండాలి..బ్రాడ్ బాండ్ తరహాలో జియో ఎయిర్ ఫైబర్ స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది.
జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్లు:- రూ.599 ప్లాన్ లో 30 ఎంబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్, డిస్నీ+ హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, జియో సినిమా, సన్ నెక్ట్స్ తదిత ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వీక్షించొచ్చు..రూ.899 ప్లాన్ లో 100 Mbps ఇంటర్నెట్ స్పీడ్ అదనం..రూ.1199 ప్లాన్ కింద నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో కార్యక్రమాలు చూడొచ్చు..జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ క్యాటగిరిలో రూ.1499 ప్లాన్ మీద 300 Mbps ఇంటర్నెట్ వేగంతోపాటు జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్లన్నీ చూడవచ్చు. రూ.2499 ప్లాన్ కింద 500 Mbps స్పీడ్, రూ.3999-1 Gbps స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది..అయితే ఈ ప్లాన్లపై అదనంగా GST పే చేయాల్సి ఉంటుంది.
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
This website uses cookies.