శ్రీకాళహస్తీ: శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం స్వామి వారి ధ్వజారోహణం అత్యంత వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అష్టదిక్పాలకులను, బ్రహ్మ విష్ణువులను, సకల దేవతా ముని గణాలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణాన్ని నిర్వహించారు. పురవిహారం చేసిన పంచమూర్తులు ఆలయంలోని స్వామి వారి గర్భాలయం ముందు కొలువు తీర్చారు. వెండి అంబానీలలో అధిష్టింపజేసిన స్వామి అమ్మవార్ల ముందు కలిసి స్థాపన చేసి పూజలు చేశారు. త్రిశూలానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం వెలిగించి శాశ్వతంగా పూజలు చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం వృషభ ధ్వజాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్టాపించి ప్రత్యేక పూజలు చేసి సకల దేవత గణాలను స్వాగతించారు. పన్నెండు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి విఘ్నాలు జరగకుండా నిర్విఘ్నంగా జరిగేలా చూడమంటూ పూజించారు. కర్పూర నిరాజనాలు అర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఓం నమశ్శివాయ నామస్మరణలు మార్మోగాయి.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.