అమరావతి: వైసీపీ ముఖ్యనేత,, మంగళగిరి ఎమ్మేల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి సోమవారం రాజీనామా చేశారు..ఈ సందర్బంలో అయన మీడియాతో మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు 2014 నుంచి నేటి వరకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.. నీతీ, నిజాయితీలతో శాసనసభ్యుడిగా పనిచేశానని,,ఒకింత బాధగా ఉన్నప్పటికీ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.. మొదటగా శాసన సభ్యుడిగా రాజీనామా చేశానని, స్పీకర్ ఫార్మాట్ లో లేఖ ఇచ్చానని వెల్లడించారు.. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో స్పీకర్ ఓఎస్ డీకి లేఖను అందించినట్లు చెప్పారు. తన రాజీనామాను ఆమోదించమని కోరానని తెలిపారు.. వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యే పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు..ఇన్నాళ్లు తనకు రాజకీయంగా అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డికి ఆళ్ల ధన్యవాదాలు తెలియజేశారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.