వైసీపీకి మంగళగిరి ఎమ్మేల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామా
అమరావతి: వైసీపీ ముఖ్యనేత,, మంగళగిరి ఎమ్మేల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి సోమవారం రాజీనామా చేశారు..ఈ సందర్బంలో అయన మీడియాతో మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు 2014 నుంచి నేటి వరకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.. నీతీ, నిజాయితీలతో శాసనసభ్యుడిగా పనిచేశానని,,ఒకింత బాధగా ఉన్నప్పటికీ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.. మొదటగా శాసన సభ్యుడిగా రాజీనామా చేశానని, స్పీకర్ ఫార్మాట్ లో లేఖ ఇచ్చానని వెల్లడించారు.. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో స్పీకర్ ఓఎస్ డీకి లేఖను అందించినట్లు చెప్పారు. తన రాజీనామాను ఆమోదించమని కోరానని తెలిపారు.. వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యే పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు..ఇన్నాళ్లు తనకు రాజకీయంగా అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డికి ఆళ్ల ధన్యవాదాలు తెలియజేశారు.