దంపతులు పరస్పర అంగీకారంతో..
అమరావతి: విడాకుల ప్రక్రియను సులభతరం చేస్తూ సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం కీలక తీర్పు వెలువరించింది..దంపతులు పరస్పర అంగీకారంతో విడిపోవాలి అనుకుంటే విడాకుల కోసం 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది..దంపతులు కోరుకుంటే వెంటనే విడాకుల మంజూరు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది..ఆర్టికల్ 142 ప్రకారం ప్రత్యేక అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు విడాకులను మంజూరు చేయొచ్చని తెలిపింది..భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవాలి అనుకుంటే అందుకోసం ఆరు నెలలు ఆగాల్సిన అవసరం లేదని,,కొన్ని షరతులతో ఈ తప్పనిసరి నిరీక్షణ గడువును ఎత్తివేయొచ్చని జస్టిస్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, అభయ్ ఎస్.ఓకా, విక్రమ్ నాథ్, జేకే మహేశ్వరి సభ్యులతో కూడిన ధర్మాసంన తీర్పు వెలువరించింది..
విడాకుల అంశాన్ని కుటుంబ న్యాయస్థానాలకు పరిమితం చేయకుండానే సుప్రీంకోర్టు నేరుగా విడాకులు మంజూరు చేయాలంటూ పలు పిటీషన్లు దాఖలయ్యాయి..పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునే వారి విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 పరిధిలోని ప్రత్యేక అధికారాలను వినియోగిచుకునే వీలుందా అనే దానిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది..2016 జూన్ 29న ఈ పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు..ఈ వ్యాజ్యలపై సుధీర్ఘంగా విచారించిన బెంచ్,,2022 సెప్టెంబర్ లో తీర్పు రిజర్వ్ చేసింది..నేడు తీర్పు వెలువరించింది.
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
This website uses cookies.