తాత్కాలికంగా VRC కళాశాలలో ఏర్పాటు..
నెల్లూరు: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వెంకటాచలం మండలం కనుపూరు బిట్-2 గ్రామంలో ఏర్పాటు చేయనున్న ప్రాంతీయ విద్యా కేంద్రం భవన నిర్మాణానికి స్థలాన్ని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ సోమవారం పరిశీలించారు.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పాండిచ్చేరి రాష్ట్రాలకు సంబంధించి ప్రాంతీయ విద్యా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిందన్నారు..ఈ నేపథ్యంలో భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని కనుపూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ పరిశీలించి, రైతులతో మాట్లాడారు..భవన నిర్మాణాలకు స్థలం అవసరమని, రైతుల భూములకు ప్రభుత్వం నుంచి మంచి ధర ఇప్పిస్తామని, రైతులందరూ విద్యా కేంద్రం ఏర్పాటుకు భూములిచ్చి సహకరించాలని కలెక్టర్ కోరారు. అనంతరం నెల్లూరు నగరంలోని VRC కళాశాలలో ప్రాంతీయ విద్యా కేంద్రం తాత్కాలికంగా ఏర్పాటుకు భవనాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రాంతీయ విద్యా కేంద్రం ఏర్పాటుకు అన్ని వసతులతో తాత్కాలిక గదులను కేటాయించాలని VRC కళాశాల ప్రిన్సిపాల్ కు సూచించారు.
రాష్ట్రస్థాయి సదస్సు:- నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ (జాతీయస్థాయిలో పాఠ్యాంశాల కూర్పు) పై నెల్లూరు శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో నిర్వహించే రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన పాల్గొంటారని, ఈ సదస్సుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు, ఏపీసీలు, ఆర్జేడీలు, డైట్ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ సదస్సు అనంతరం VRC కళాశాలలో ప్రాంతీయ విద్యా కేంద్రం ఏర్పాటుకు తాత్కాలిక భవనాలను సంజయ్ కుమార్ పరిశీలిస్తారన్నారు..కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్, డిఇఓ గంగా భవాని, తహశీల్దారు నరేష్ ఉన్నారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.