AMARAVATHI

సిటీ నియోజకవర్గం పరిధిలో ఓటరు ప్రత్యేక కేంద్రాలు,ప్రజలు ఉపయోగించుకొవాలి-కమిషనర్ వికాస్

నెల్లూరు: నగర పాలక సంస్థ సిటీ నియోజకవర్గ పరిధిలోని 248 పోలింగ్ కేంద్రాలతో పాటు ఆర్.టి.సి బస్టాండ్, M.G.షాపింగ్ మాల్, షాపింగ్ కాంప్లెక్స్ లు వంటి వివిధ ప్రత్యేక కేంద్రాలలో ఈ నెల 8-11-2023 నుంచి 8-12-2023 వరకు నెల రోజులు పాటు ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ వికాస్ మర్మత్ తెలిపారు.గురువారం ఓటరు ప్రత్యేక నమోదు కేంద్రాలను ఎన్నికల సిబ్బంది సమర్ధంగా నిర్వహించి,  ప్రతి ఒక్క ఓటరూ జాబితాలో పేరు నమోదు చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి కమిషనర్ సూచించారు.

ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రచురించిన తుది ఓటర్ డ్రాఫ్ట్ రోల్ ముసాయిదా జాబితాలో నూతనంగా సవరణలు, అభ్యంతరాలు, ఫారం 6,7,8 దరఖాస్తులను బి.ఎల్.ఓ. లు క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని కోరారు. ఓటరు ప్రత్యేక కేంద్రాలలో బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారని, ఓటర్లంతా జాబితాలో ఓట్లను సరిచూసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫారం 6,7,8 దరఖాస్తులను ఓటర్లు అందజేయాలని కమిషనర్ కోరారు. ఓటరు జాబితాలో సవరణలు, అభ్యంతరాలు, మార్పు చేర్పులకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాలను అర్హులైన ఓటర్లు వినియోగించుకుని పరిపూర్ణమైన ఓటరు జాబితా రూపొందించేందుకు సహకరించాలన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

8 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

14 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

1 day ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

1 day ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

1 day ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

This website uses cookies.