సిటీ నియోజకవర్గం పరిధిలో ఓటరు ప్రత్యేక కేంద్రాలు,ప్రజలు ఉపయోగించుకొవాలి-కమిషనర్ వికాస్
నెల్లూరు: నగర పాలక సంస్థ సిటీ నియోజకవర్గ పరిధిలోని 248 పోలింగ్ కేంద్రాలతో పాటు ఆర్.టి.సి బస్టాండ్, M.G.షాపింగ్ మాల్, షాపింగ్ కాంప్లెక్స్ లు వంటి వివిధ ప్రత్యేక కేంద్రాలలో ఈ నెల 8-11-2023 నుంచి 8-12-2023 వరకు నెల రోజులు పాటు ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ వికాస్ మర్మత్ తెలిపారు.గురువారం ఓటరు ప్రత్యేక నమోదు కేంద్రాలను ఎన్నికల సిబ్బంది సమర్ధంగా నిర్వహించి, ప్రతి ఒక్క ఓటరూ జాబితాలో పేరు నమోదు చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి కమిషనర్ సూచించారు.
ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రచురించిన తుది ఓటర్ డ్రాఫ్ట్ రోల్ ముసాయిదా జాబితాలో నూతనంగా సవరణలు, అభ్యంతరాలు, ఫారం 6,7,8 దరఖాస్తులను బి.ఎల్.ఓ. లు క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని కోరారు. ఓటరు ప్రత్యేక కేంద్రాలలో బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారని, ఓటర్లంతా జాబితాలో ఓట్లను సరిచూసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫారం 6,7,8 దరఖాస్తులను ఓటర్లు అందజేయాలని కమిషనర్ కోరారు. ఓటరు జాబితాలో సవరణలు, అభ్యంతరాలు, మార్పు చేర్పులకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాలను అర్హులైన ఓటర్లు వినియోగించుకుని పరిపూర్ణమైన ఓటరు జాబితా రూపొందించేందుకు సహకరించాలన్నారు.