నెల్లూరు: పరిపూర్ణమైన ఓటర్ల జాబితా తయారీకి రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ కోరారు. నగర పాలక సంస్థ పరిధిలోని ఓటర్ల జాబితా రూపొందించడంలో బూత్ లెవెల్ అధికారులకు సహకరించాలని కమిషనర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. స్థానిక కార్పొరేషన్ లోని కమిషనర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా సవరణపై కమిషనర్ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత నెల 21 నుండి బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ తిరిగి ప్రస్తుతం వున్న ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారని, పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు వారికి సంపూర్ణంగా సహకరించినట్లయితే ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించగలమన్నారు.
రాజకీయ పార్టీలన్నీ ప్రతి పోలింగ్ స్టేషన్ కు బూత్ లెవెల్ ఏజెంట్ను నియమించాలని కోరారు. బి.ఎల్.వో లు ఈ నెల 21 వ తేదీ వరకు ఇంటింటికి తిరిగి ముందస్తు ఓటర్ల జాబితా పనులను పూర్తి చేయనున్నారని వివరించారు. అర్హులైనప్పటికీ ప్రస్తుత ఓటర్ల జాబితాలో నమోదు కాని వారు, ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 సంవత్సరాలు నిండి ఓటర్లుగా నమోదు కావలసినవారు, నివాసం మారినవారు, ఇటీవల మరణించిన వారి సమాచారాన్ని సేకరించి, ఓటర్ల జాబితాలో తప్పులను సరి చేస్తున్నామని కమిషనర్ ప్రకటించారు. ఒకే ఇంట్లో పదిమందికి పైగా ఓటర్లు, వంద సంవత్సరాలు దాటిన ఓటర్లు ఉంటే కనుక అలాంటి వారిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఎక్కడైనా పోలింగ్ స్టేషన్లు మార్పు చేయవలసి ఉన్న, ఓటర్ల జాబితా సవరణలో ఏవైనా సమస్యలు ఉన్న ఏ.ఈ.ఆర్.ఓ ల దృష్టికి తీసుకురావాలన్నారు. ఒకే ఇంటికి సంబంధించిన కుటుంబ సభ్యుల ఓట్లు వేరు వేరు పోలింగ్ బూత్ లో కాకుండా, ఒకే పోలింగ్ బూత్ లో ఉండే విధంగా జాబితాలో మార్పు చేర్పులు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు CONG-మల్లికార్జున, TDP-భువనేశ్వర్ ప్రసాద్, BSP-శ్రీరామ్,CPI – షాన్ వాజ్, షిరాజ్, తహశీల్దార్ నిర్మాలనంద బాబా, DCP దేవీ కుమారి,EDT మాధవి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.