అమరావతి: ఎల్ నినో ప్రభావంతో 2023లో దేశంలో సాధారణం వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది..ఆసియాలో ఎల్-నినో సంభావ్యత పెరుగుతూ వస్తోందని,,ఇది రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపనున్నట్టు తెలిపింది.. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా 868.6 మిల్లీమీటర్లు మేర నమోదవుతాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది..రాబోయే రోజుల్లో ఈ రుతుపవనాల వర్షాలు ధీర్ఘకాలిక సగటులో 94 శాతం అంటే సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని స్కైమెట్ తెలిపింది..
దేశంపై ఎల్ నినో ప్రభావం:- ఎల్ నినో తీవ్రతను బట్టి వాతావరణంలో మార్పులు సంభవించవచ్చు..ఇది భారతదేశంలోని పలు ప్రాంతాలపై ప్రభావం చూపించవచ్చు..ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ ప్రాంతాలలో ఇది కరువు పరిస్థితులకు దారితీసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది..ఇదే సమయంలో వ్యవసాయంపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నట్టు రికార్డులు తెలియచేస్తున్నాయి..దేశంలోని సగం మేరకు వ్యవసాయ భూములు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురిసే వానాలపైనే ఆధారపడతాయి..పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర భారత వ్యవసాయ “బౌల్” గా పేరువున్న ఉత్తరప్రదేశ్లలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు వున్నాయి..అకాల వర్షాలు, వడగండ్ల వానలు ఇప్పటికే భారతదేశంలోని సారవంతమైన ఉత్తర, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో శీతాకాలంలో పండించిన గోధుమ వంటి పంటలను దెబ్బతీశాయి..దీని కారణంగా వేలాది మంది రైతులు నష్టాలకు గురయ్యారు.
భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్ మహా సముద్రం ఉపరితలంపై అసాధారణ వేడి లేదా చల్లదనం లాంటి పరిస్థితులు నమోదు అవుతాయి.ఇలాంటి పరిణామాలను ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ సిస్టం(ENSO) అని పిలుస్తారు.. ENSO పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను,,వర్షపాతాలను ప్రభావితం చేస్తాయి..
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.