AMARAVATHI

ఈ నెల 20 నుంచి పెన్నా డెల్టాకు సాగు నీరు విడుదల-మంత్రి కాకాణి

నెల్లూరు: జిల్లాలో ప్రస్తుతం వున్న నీటి వనరుల లభ్యతను దృష్టిల్లో వుంచుకొని,ఈ రబీ సీజన్ లో పెన్నా డెల్టా క్రింద సుమారు రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు రాష్ట్రవ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు..మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ అధ్యక్షతన జరిగిన జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశంలో మంత్రి  కాకాణి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.. జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాల ఆయకట్టు కింద మొదటి పంటకు సాగునీరు అందించేందుకు మంగళవారం జరిగిన జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశంలో పెన్నా డెల్టా కింద వున్న సుమారు రెండు లక్షల నుంచి 2.2 లక్షల ఎకరాలకు సాగు నీటిని  కేటాయిస్తూ కమిటి తీర్మానించినట్లు తెలిపారు. నీటి లభ్యతను బట్టి నాన్ డెల్టా ప్రాంతానికి కూడా సాగు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.. జిల్లాలో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా సాగునీరు అందిస్తామన్నారు..ప్రస్తుతం వర్షా భావ పరిస్థితుల కారణంగా ఈ సీజన్లో రిజర్వాయర్లలో, చెరువుల్లో గాని వున్న నీటి లభ్యతను అంచనా వేసి త్రాగు నీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా వున్న నీటిని సమర్ధవంతంగా  వినియోగించుకుంటూ  రైతులకు అవసరమైన సాగు నీరు ఈ నెల 20వ తేదీ నుండి ఇచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

కలెక్టర్ హరినారాయణన్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో వ్యవసాయ, జల వనరుల శాఖలను సమన్వయం చేస్తూ  త్రాగునీటి అవసరాలను కూడా తీర్చుకుంటా సాగు నీటిని సమర్ధవంతంగా సద్వినియోగం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు..ఈ సమావేశంలో ఎమ్మేల్యేలు,ఎమ్మేల్సీలు,,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

7 hours ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

9 hours ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

9 hours ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

14 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

1 day ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

1 day ago

This website uses cookies.