AMARAVATHI

దేశ ఐక్యత కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ-బీజెపీ అధ్యక్షుడు బండి.సంజయ్

హైదరాబాద్: నమ్మిన సిద్ధాంతాల కోసం, దేశ ఐక్యత కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ కొనియాడారు.జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని బుధవారం బండి సంజయ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాల సాధనే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ నిజమైన వారసుడు ప్రధాని నరేంద్రమోదీ అని, 370 ఆర్టికల్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వంటి నిర్ణయాలు అందులో భాగమేనని గుర్తు చేశారు.అతి చిన్న వయసులోనే కలకత్తా వర్శిటీ వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు. ఎంతో మంది భావి భారత పౌరులను తీర్చిదిద్దారన్నారు..కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న మైనారిటీ సంతుష్టీకరణ విధానాలను చూసి తట్టుకోలేక బయటకు వచ్చి పోరాడారని,,జనసంఘ్ పార్టీని స్థాపించి కొత్త రాజకీయ ఉద్యమానికి తెరలేపిన వ్యక్తి ముఖర్జీ,, పశ్చిమబెంగాల్ ను పాకిస్తాన్ లో కలపాలనే కుట్రను వ్యతిరేకించి పోరాడిన నాయకుడన్నారు.. ఏక్ దేశ్ మే దో నిషాన్.. దో విధాన్… దో ప్రధాన్.. నహీచలేంగా అంటూ 370 ఆర్టికల్ రద్దు కోసం పోరాడిన వ్యక్తి అన్నారు..ప్రాణాలు పోతాయని తెలిసి కూడా దేశం కోసం వెనుకాడకుండా పోరాడిన మహనీయుడని,, ఇతర దేశాల్లో వలస ఉన్న భారతీయులను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన భావించిన గొప్ప వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ పేర్కొన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

39 mins ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

2 hours ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

3 hours ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

4 hours ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

6 hours ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

24 hours ago

This website uses cookies.