అమరావతి: విపత్తులను ఎదుర్కొనే విధంగా మౌలిక సదుపాయాలకు సంబంధించిన పరిజ్ఞానాన్నిఅభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని,,రవాణా మౌలిక సదుపాయాలు ఎంత ముఖ్యమైనవో సామాజిక, డిజిటల్ మౌలిక సదుపాయాలు కూడా అంతే ముఖ్యమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు..మంగళవారం విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాలపై కూటమి (CDRI) కోసం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు..ప్రకృతి వైపరీత్యాలను, వాటిని ఎలా ఎదుర్కొవచ్చొ అనే విషయాల గురించి ప్రధాని మోడీ ఈ సందర్భంగా పలు సూచలను చేశారు..ప్రధాని మోడీ మాట్లాడుతూ మౌలిక సదుపాయాలను ఆధునీకరించేటప్పుడు, అటువంటి పరిజ్ఞానాన్ని జాగ్రత్తగా ఉపయోగించాల్సి వుంటుందన్నారు..స్థానిక పరిజ్ఞానంతో కూడిన ఆధునిక సాంకేతికతలు స్థితిస్థాపకతకు, నిర్వహణకు గొప్పవిగా ఉంటాయని ప్రధాని మోడీ అన్నారు.. “కేవలం నాలుగు సంవత్సరాలలో 40 దేశాలు CDRIలో భాగమయ్యాయి.. గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్, చిన్న, పెద్ద దేశాలు దీనిద్వారా ఏకతాటిపైకి రావడంతో ఈ సదస్సు చాలా ముఖ్యమైనదిగా మారిందన్నారు..ప్రస్తుతం భారతదేశం, ఐరోపా అంతటా మనకు వేడి తరంగాలు వీస్తున్నాయి.. భూకంపాల వల్ల అనేక ద్వీప దేశాలు దెబ్బతిన్నాయి..సిరియా, టర్కీలలో సంభవించిన భూకంపాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది..ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం CDRIని గొప్ప అంచనాలతో చూస్తోందంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు..గత విపత్తులను అధ్యయనం చేయడం, వాటి నుంచి నేర్చుకోవడం ఒక మార్గం అని, ఇందులో CDRI కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. విపత్తుల ప్రభావం స్థానికంగా ఉండదు, కాబట్టి మన స్పందన ఒంటరిగా కాకుండా సమగ్రంగా, ఐక్యంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
This website uses cookies.