అమరావతి: విపత్తులను ఎదుర్కొనే విధంగా మౌలిక సదుపాయాలకు సంబంధించిన పరిజ్ఞానాన్నిఅభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని,,రవాణా మౌలిక సదుపాయాలు ఎంత ముఖ్యమైనవో సామాజిక, డిజిటల్ మౌలిక సదుపాయాలు కూడా అంతే ముఖ్యమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు..మంగళవారం విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాలపై కూటమి (CDRI) కోసం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు..ప్రకృతి వైపరీత్యాలను, వాటిని ఎలా ఎదుర్కొవచ్చొ అనే విషయాల గురించి ప్రధాని మోడీ ఈ సందర్భంగా పలు సూచలను చేశారు..ప్రధాని మోడీ మాట్లాడుతూ మౌలిక సదుపాయాలను ఆధునీకరించేటప్పుడు, అటువంటి పరిజ్ఞానాన్ని జాగ్రత్తగా ఉపయోగించాల్సి వుంటుందన్నారు..స్థానిక పరిజ్ఞానంతో కూడిన ఆధునిక సాంకేతికతలు స్థితిస్థాపకతకు, నిర్వహణకు గొప్పవిగా ఉంటాయని ప్రధాని మోడీ అన్నారు.. “కేవలం నాలుగు సంవత్సరాలలో 40 దేశాలు CDRIలో భాగమయ్యాయి.. గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్, చిన్న, పెద్ద దేశాలు దీనిద్వారా ఏకతాటిపైకి రావడంతో ఈ సదస్సు చాలా ముఖ్యమైనదిగా మారిందన్నారు..ప్రస్తుతం భారతదేశం, ఐరోపా అంతటా మనకు వేడి తరంగాలు వీస్తున్నాయి.. భూకంపాల వల్ల అనేక ద్వీప దేశాలు దెబ్బతిన్నాయి..సిరియా, టర్కీలలో సంభవించిన భూకంపాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది..ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం CDRIని గొప్ప అంచనాలతో చూస్తోందంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు..గత విపత్తులను అధ్యయనం చేయడం, వాటి నుంచి నేర్చుకోవడం ఒక మార్గం అని, ఇందులో CDRI కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. విపత్తుల ప్రభావం స్థానికంగా ఉండదు, కాబట్టి మన స్పందన ఒంటరిగా కాకుండా సమగ్రంగా, ఐక్యంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.