AMARAVATHI

ఆరుగురు IPS, ముగ్గురు IASలపై బదలీ వేటు వేసిన ఎన్నికల సంఘం

అమరావతి: ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం 6- IPS,,3- IAS  అధికారులను బదిలీ చేసింది..చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలకు సంబంధించి బదలీ వేటు వేస్తూ ఆదేశాలిచ్చింది..ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి,, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి,, చిత్తూరు ఎస్పీ పి.జాషువా,, అనంతపురం ఎస్పీ అన్బురాజన్,, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్​పై బదిలీ వేటు వేసింది..సీనియర్ IPS అధికారి, గుంటూరు రేంజ్ IG పాలరాజును కూడా బదిలీ చేసింది..

ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని వచ్చిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న మూడు జిల్లాల కలెక్టర్లపై వేటు వేశారు.. కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రాజబాబు,, అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి,,తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషాలపై బదలీ వేటు పడింది..వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఈసీ సీఈవో మీనాకు ఎమర్జన్సీ నోట్​ను ఎన్నికల సంఘం పంపింది..బదలీ అయిన జిల్లాల ఎస్పీలు,,కలెక్టర్లను ఎన్నికలకు సంబంధం లేని పోస్ట్‌ ల్లో నియమించాలని జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది..అలాగే బదలీ అయిన అధికారులంతా తమ బాధ్యతల్ని దిగువ స్థాయి అధికారులకు మంగళవారం సాయంత్రం 5 గంటలోపు అప్పగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది..బదిలీ అయిన జిల్లాల్లో కలెక్టర్లు,, ఎస్పీల స్థానంలో నియామించేందుకు ఒక్కొక్క జిల్లాలో ముగ్గురు అధికారుల పేర్లను కమిషన్​కు పంపాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

12 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

15 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

15 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

17 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.