ఆరుగురు IPS, ముగ్గురు IASలపై బదలీ వేటు వేసిన ఎన్నికల సంఘం
అమరావతి: ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం 6- IPS,,3- IAS అధికారులను బదిలీ చేసింది..చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలకు సంబంధించి బదలీ వేటు వేస్తూ ఆదేశాలిచ్చింది..ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి,, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి,, చిత్తూరు ఎస్పీ పి.జాషువా,, అనంతపురం ఎస్పీ అన్బురాజన్,, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్పై బదిలీ వేటు వేసింది..సీనియర్ IPS అధికారి, గుంటూరు రేంజ్ IG పాలరాజును కూడా బదిలీ చేసింది..
ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని వచ్చిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న మూడు జిల్లాల కలెక్టర్లపై వేటు వేశారు.. కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రాజబాబు,, అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి,,తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషాలపై బదలీ వేటు పడింది..వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఈసీ సీఈవో మీనాకు ఎమర్జన్సీ నోట్ను ఎన్నికల సంఘం పంపింది..బదలీ అయిన జిల్లాల ఎస్పీలు,,కలెక్టర్లను ఎన్నికలకు సంబంధం లేని పోస్ట్ ల్లో నియమించాలని జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది..అలాగే బదలీ అయిన అధికారులంతా తమ బాధ్యతల్ని దిగువ స్థాయి అధికారులకు మంగళవారం సాయంత్రం 5 గంటలోపు అప్పగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది..బదిలీ అయిన జిల్లాల్లో కలెక్టర్లు,, ఎస్పీల స్థానంలో నియామించేందుకు ఒక్కొక్క జిల్లాలో ముగ్గురు అధికారుల పేర్లను కమిషన్కు పంపాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు.