DISTRICTS

పట్టభద్రులు,ఉపాధ్యాయ ఎన్నికకు సంబంధించి తుది జాబిత డిశంబరు 30న ప్రచురణ-కలెక్టర్

నెల్లూరు: ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 76 పోలింగ్ కేంద్రాలను, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి 36 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు.శనివారం కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ హాల్లో ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని మౌలిక వసతులు ఉన్నటువంటి కళాశాలలు, పాఠశాలలను పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసినట్టుగా తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రo ను ఏర్పాటు చేసామన్నారు. పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి ఆత్మకూరు, బుచ్చి, కొవూరు, పొదలకూరు, ఉదయగిరి, వింజమూరు, కలిగిరి మండలాలలో రెండు పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా కందుకూరు – 4, కావలి – 6, నెల్లూరు అర్బన్ – 9, నెల్లూరు రూరల్ – 19 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 7వ తేది నాటికి జిల్లాలో పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి 1,13,837 మంది, ఉపాధ్యాయ ఎన్నికకు సంబంధించి 7,783 మంది ఓటర్లుగా నమోదుకు దరఖాస్తులు సమర్పించారన్నారు. వాటిని పరిశీలించి ఈ నెల 19వ తేది నాటికి డ్రాఫ్ట్ తయారి పూర్తిచేసి, 23వ తేదిన ఎలక్ట్రోరల్ రోల్స్ జాబితా ప్రచురిస్తామని, వాటిపై అభ్యంతరాలను డిశంబర్ 9 వరకు స్వీకరిస్తామన్నారు. వచ్చిన అభ్యంతరాలను డిశంబర్ 25 నాటికి పరిష్కరించి, తుది జాబితాను డిశంబర్ 30న ప్రచురిస్తామన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

11 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

17 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

1 day ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

1 day ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

2 days ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

This website uses cookies.