DISTRICTS

పారామెడికల్ కోర్సుల ద్వారా వైద్య రంగంలో సహాయకుల కొరత తీరుతుంది-లోక్ సభ స్పీకర్

నెల్లూరు: అంత్యోదయ మార్గంలో గ్రామీణ ప్రజలకు, యువతకు, అణగారిన వర్గాలకు స్వర్ణభారత్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని లోక్ సభ సభాపతి ఓం బిర్లా అన్నారు. సోమవారం హెలికాఫ్టర్ ద్వారా వెంకటాచలం లోని అక్షర విద్యాలయానికి చేరుకున్న లోక్ సభ స్పీకర్,మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి స్వర్ణభారత్ ట్రస్ట్ – సోమ సాంకేతిక శిక్షణా సంస్థ అందిస్తున్న పలు శిక్షణా కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం సోమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విజయ సారధి డ్రైవింగ్ పాఠశాలను ప్రారంభించారు. స్వర్ణభారత్ ట్రస్ట్ లో అనన్య పారామెడికల్ కోర్సుల శిక్షణా కేంద్రాన్ని, అక్కడి కౌసల్యా సదన్ లో ఏర్పాటు చేసిన ప్రజ్ఞ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ కోవిడ్ సమయంలో వైద్య సిబ్బంది కొరత ప్రస్ఫుటంగా కనిపించిందని, ఈ నేపధ్యంలో పారామెడికల్ కోర్సుల ద్వారా వైద్య రంగంలో సహాయకుల కొరత తీరగలదని ఆకాంక్షించారు.

మాజీ ఉపరాష్ట్రపతి:- ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ జీవితంలో అన్నీ మనం ఊహించినట్లు జరగవని తెలిపారు. ముఖ్యంగా అధికారానికి మనం దగ్గరగా వెళ్ళే కొలదీ దూరమౌతుందని, దూరంగా జరిగే కొలదీ దగ్గరవుతుందన్నారు. జీవితంలో ఏదీ ఆశించకుండా పని చేసుకుంటూ ముందు సాగడం వల్ల ప్రశాంతంగా అనుకున్నది చేయగలిగానని, ప్రజలకు చేసిన సేవ అధికారంగా మారి, మరింత సేవ చేసే అవకాశానిచ్చిందన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

35 mins ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

40 mins ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

3 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

24 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 day ago

This website uses cookies.