తిరుపతి: సంస్కృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శుక్రవారం సతీ సమేతంగా తిరుపతికి చేరుకున్న ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్ కు రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఘన స్వాగతం పలికారు.అనంతరం ఉపరాష్ట్రపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు శ్రీవారి దర్శనార్థం బయల్దేరి వెళ్లారు.ఈ సందర్బంలో భారత ఉప రాష్ట్రపతి మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సమేతంగా కలియుగ ప్రత్యక్షదైవాన్నిదర్శించుకోవటం ఆనందంగా ఉందని,,దేశ ప్రజలందరి ఆయురారోగ్యాలు, శాంతి సౌఖ్యాల కోసం స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. తిరుమల నుంచి మధ్యాహ్నం 1.00 గంటకు జాతీయ సంస్కృత యూనివర్సిటీ చేరుకుని మూడవ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి, విద్యార్థినీ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలను అందచేశారు. తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 3.15 గం.లకు తిరుగు ప్రయాణం కాగా రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్,అధికారులు సాదర వీడ్కోలు పలికారు.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.