AMARAVATHI

శనివారానికి పూర్తిగా వరద తగ్గే అవకాశం,విజయవాడ-హైదరాబాద్ ల మధ్య రాకపోకలు-కాంతిరాణా

అమరావతి: హైదరాబాద్-విజయవాడల మధ్య వాహనల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది..ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర 65వ జాతీయ రహదారిపై గురువారం నుంచి మొదలైన వరద ప్రవాహం కొనసాగుతోంది..వరద ప్రవాహం అదుపులోకి రాకపోవడంతో పోలీసులు రాకపోకలను నిలిపివేశారు..తెలంగాణలో భారీ వర్షాలకు కురిసిన నేపధ్యంలో ఖమ్మంలో నుంచి మున్నేరు వాగుకు 1,92,000 క్యూసెకుల వరద నీరు వస్తొంది..ఐతవరం వద్ద మునేరు వరద ఉధృతిని విజయవాడ పోలీసు కమీషనర్ కాంతిరాణా టాటా పరిశీలించారు.. సహాయక చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు..గురువారం మధ్యాహ్నం నుంచి ఈ దారిలో వాహనాలు నిలిపి వేశామని,,గురువారం రాత్రి నుంచి ఇతర మార్గాల మీదుగా ట్రాఫిక్ మళ్లించామని కమీషనర్ తెలిపారు.. ఖమ్మం దగ్గర కొంచెం వరద తగ్గినట్లు తెలుస్తుందని,, గురువారం నాటికంటే శుక్రవారం వరద ప్రవాహం కాస్త తగ్గిందని చెప్పారు..శనివారానికి పూర్తిగా వరద తగ్గే అవకాశం ఉందని,,పరిస్థితి అంచన వేసిన తరువాతే విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిని పునరుద్ధరిస్తామన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 hour ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

5 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

5 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

9 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

24 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

1 day ago

This website uses cookies.