AMARAVATHI

శనివారానికి పూర్తిగా వరద తగ్గే అవకాశం,విజయవాడ-హైదరాబాద్ ల మధ్య రాకపోకలు-కాంతిరాణా

అమరావతి: హైదరాబాద్-విజయవాడల మధ్య వాహనల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది..ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర 65వ జాతీయ రహదారిపై గురువారం నుంచి మొదలైన వరద ప్రవాహం కొనసాగుతోంది..వరద ప్రవాహం అదుపులోకి రాకపోవడంతో పోలీసులు రాకపోకలను నిలిపివేశారు..తెలంగాణలో భారీ వర్షాలకు కురిసిన నేపధ్యంలో ఖమ్మంలో నుంచి మున్నేరు వాగుకు 1,92,000 క్యూసెకుల వరద నీరు వస్తొంది..ఐతవరం వద్ద మునేరు వరద ఉధృతిని విజయవాడ పోలీసు కమీషనర్ కాంతిరాణా టాటా పరిశీలించారు.. సహాయక చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు..గురువారం మధ్యాహ్నం నుంచి ఈ దారిలో వాహనాలు నిలిపి వేశామని,,గురువారం రాత్రి నుంచి ఇతర మార్గాల మీదుగా ట్రాఫిక్ మళ్లించామని కమీషనర్ తెలిపారు.. ఖమ్మం దగ్గర కొంచెం వరద తగ్గినట్లు తెలుస్తుందని,, గురువారం నాటికంటే శుక్రవారం వరద ప్రవాహం కాస్త తగ్గిందని చెప్పారు..శనివారానికి పూర్తిగా వరద తగ్గే అవకాశం ఉందని,,పరిస్థితి అంచన వేసిన తరువాతే విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిని పునరుద్ధరిస్తామన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *