AMARAVATHI

ఈ నెల 24న తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందేభారత్ రైళ్లు

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మరో 2 వందేభారత్ ఎక్స్ ప్రెస్ లు పరుగులు తీయ్యనున్నాయి..ఇందులో ఒకటి బెంగళూరుకు,,మరోకటి చెన్నైవెళ్లే ప్రయాణీకుల కోసం..హైదరాబాద్, బెంగళూరు మధ్య పరుగులు పెట్టే ఈ రైలును ప్రధాని మోదీ సెప్టెంబరు 24వ తేదిన వర్చువల్ గా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు..ఆదే రోజున కాచిగూడ నుంచి ఉదయం 5.30 గంటలకు ట్రైన్ బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్ పూర్ చేరుకోనున్నది.. 25వ తేది నుంచి ఈ రైలు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది..సోమవారం ఉదయం 5.30 గంటలకు బయలుదేరి,, మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా మధ్యాహ్నం 2.30 గంటలకు యశ్వంత్ పూర్ కు చేరుకుంటుంది..తిరిగి 2.45 నిమిషాలకు యశ్వంత్ పూర్ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటల 45 నిమిషాలకు కాచిగూడ చేరుకుంటుంది..అలాగే విజయవాడ-చెన్నై వందేభారత్ ఈ రైలు విజయవాడ నుంచి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై చేరుకుంటుంది..గురువారం మినహా అన్ని రోజులు ఈ ట్రైన్ ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది.. వందేభారత్ ఎక్స్ ప్రెస్ రోజూ 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి, 12.10 నిమిషాలకు చెన్నై చేరుకుంటుదని వివరించారు..తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20 నిమిషాలకి ప్రారంభమై రాత్రి 10 గంటలకు విజయవాడకు చేరుతుందని,,ఈ రైలుతో పాటు సెప్టెంబర్ 24వ తేదిన ప్రధాని మోదీ మొత్తం 9 వందేభారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారని రైల్వే అధికారులు తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

1 hour ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

1 hour ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

8 hours ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

1 day ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

1 day ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

1 day ago

This website uses cookies.