ఈ నెల 24న తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందేభారత్ రైళ్లు
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మరో 2 వందేభారత్ ఎక్స్ ప్రెస్ లు పరుగులు తీయ్యనున్నాయి..ఇందులో ఒకటి బెంగళూరుకు,,మరోకటి చెన్నైవెళ్లే ప్రయాణీకుల కోసం..హైదరాబాద్, బెంగళూరు మధ్య పరుగులు పెట్టే ఈ రైలును ప్రధాని మోదీ సెప్టెంబరు 24వ తేదిన వర్చువల్ గా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు..ఆదే రోజున కాచిగూడ నుంచి ఉదయం 5.30 గంటలకు ట్రైన్ బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్ పూర్ చేరుకోనున్నది.. 25వ తేది నుంచి ఈ రైలు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది..సోమవారం ఉదయం 5.30 గంటలకు బయలుదేరి,, మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా మధ్యాహ్నం 2.30 గంటలకు యశ్వంత్ పూర్ కు చేరుకుంటుంది..తిరిగి 2.45 నిమిషాలకు యశ్వంత్ పూర్ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటల 45 నిమిషాలకు కాచిగూడ చేరుకుంటుంది..అలాగే విజయవాడ-చెన్నై వందేభారత్ ఈ రైలు విజయవాడ నుంచి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై చేరుకుంటుంది..గురువారం మినహా అన్ని రోజులు ఈ ట్రైన్ ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది.. వందేభారత్ ఎక్స్ ప్రెస్ రోజూ 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి, 12.10 నిమిషాలకు చెన్నై చేరుకుంటుదని వివరించారు..తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20 నిమిషాలకి ప్రారంభమై రాత్రి 10 గంటలకు విజయవాడకు చేరుతుందని,,ఈ రైలుతో పాటు సెప్టెంబర్ 24వ తేదిన ప్రధాని మోదీ మొత్తం 9 వందేభారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారని రైల్వే అధికారులు తెలిపారు.