నెల్లూరు: నెల్లూరు పార్లమెంట్ తేదేపా కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతిరెడ్డి ప్రజా జీవితంలో ఇమడలేరని రాజ్యసభ సభ్యులు, ycp నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు..సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డితో, ఆమె పోన్ ద్వారా మాట్లాడిన మాటలు మీడియా ముందు బహిర్గతం చేశారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మీడియాతో ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోతే తాము స్థబ్దంగా ఉండిపోతామని ప్రశాంతి చెప్పడం వారి ఉద్దేశాన్ని బయటపెట్టిందని అన్నారు. వారు ఓడిపోతే ఇండియాతో పాటు ఇతర దేశాల్లో వారి వ్యాపారాలు చేసుకుంటారే తప్ప ప్రజలను పట్టించుకోరని ఆమె మాటలు ద్వారా స్పష్టమవుతోందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా పార్టీలోని ప్రతినాయకుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని, ప్రజల కష్టాలు తమవిగా భావించి సహకారం అందిస్తారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎటువంటి వారు తమకు నాయకులుగా కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు.
ధన ఆహంకారంతో ప్రశాంతి:- అంతకు ముందు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ పెద్దవారి పట్ల అగౌరవంగా మాట్లాడటం సరికాదని, ధన ఆహంకారం వారితో ఆ విధంగా మాట్లాడించిందని అన్నారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రశాంతి తనకు ఫోన్ చేసి తన సహకారం కోరిందని, పలువుర్ని కించపరుస్తూ మాట్లాడిందని అన్నారు. తనకు తన అన్న ప్రసన్న కుమార్ రెడ్డికి ప్రస్తుతం ఎటువంటి విభేదాలు లేవని అన్నారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.