AMARAVATHI

వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఎలక్షన్ డ్యూటీలకు దూరంగా ఉంచాలి-టీడీపీ,జనసేన

బైండోవర్ కేసులు పెడుతున్నారు…
అమరావతి: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఓటర్ల జాబితాలో అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని టీడీపీ,,జనసేన అధినేతలు చంద్రబాబు,,పవన్ కళ్యాణ్ లు చెప్పారు.మంగళవారం తర్వలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన సన్నద్ధత,,ఓటర్ల జాబితాపై విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది..ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొని రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై CECకి ఫిర్యాదు చేశారు.. టీడీపీ, జనసేనలకు CEC 15నిమిషాలు సమయం కేటాయించగా, 30 నిమిషాల పాటు విపులంగా తమ ఫిర్యాదు అంశాలను CECకి చంద్రబాబు, పవన్ వివరించార…అనంతరం చంద్రబాబు, పవన్ మీడియాతో మాట్లాడారు..
చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు..ప్రతిపక్ష పార్టీలు,, నాయకులే లక్ష్యంగా దాదాపు 7 వేల కేసులు నమోదు చేయించి వేదిస్తోందని,, వాలంటీర్లతో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారన్నారు..వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఎలక్షన్ డ్యూటీలకు దూరంగా ఉంచి,,టీచర్లు,,ప్రభుత్వ ఉద్యోగలతోనే ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ ను కోరినట్లు చంద్రబాబు చెప్పారు..రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వుండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎలక్షన్ కమిషనర్ గా ఉంటే ఎన్నికలు సజావుగా ఎలా జరుగుతాయన్నారు..ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు..దొంగ ఓట్లపై సాక్ష్యాలతో సీఈసీకి వివరించామని,,మా ఫిర్యాదుల పట్ల ఈసీ సానుకూలంగా స్పందించిందని చంద్రబాబు అన్నారు..
ఎలక్షన్ కమిషన్ సానుకూలంగా స్పందించింది-పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవటంవల్లే విజయవాడకు రావడం జరిగిందన్నారు…వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిందని CECకి తెలియజేశామని పవన్ చెప్పారు..జనసేన, టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టడాన్ని,, బైండోవర్ కేసులు నమోదు చేయడాన్ని CEC దృష్టికి తీసుకెళ్లామన్నారు..వైసీపీకి అనుకూలంగా వున్న పోలీసు అధికారులను ప్రస్తుతం బదలీలు చేసి,,ఎన్నికల నోటిఫికేషన్ సమయానికి వాళ్లు కీలక విధుల్లో చేర్పించే విధంగా వ్యవహరిస్తున్న విషయంను CECకి స్పష్టంగా తెలియ చేయడం జరిగిందన్నారు..వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని,, ఎన్నికల విధులకు దూరంగా వుంచాలని కోరినట్లు విజ్ఞప్తి చేశామన్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ను కోరడం జరిగిందని పవన్ చెప్పారు..మా విజ్ఞప్తులపై ఎలక్షన్ కమిషన్ సానుకూలంగా స్పందించిందని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చరని పవన్ తెలిపారు..కచ్చితంగా ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరుగుతాయని, ప్రభుత్వం మారుతుందని పవన్ వ్యాఖ్యనించారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

2 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

19 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

22 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

23 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

1 day ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

This website uses cookies.