AMARAVATHI

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురు కాల్పులు-7 మావోయిస్టులు హతం

అమరావతి: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు.. నారాయ‌ణ్‌పూర్‌, కాంకేర్ జిల్లాల స‌రిహ‌ద్దుల్లోని అడ‌వుల్లో ఈ కాల్పులు చోటు చేసుకున్న‌ట్లు పోలీసులు ధృవీక‌రించారు.. కాల్పుల్లో చ‌నిపోయిన 7 మావోయిస్టుల్లో ఇద్ద‌రు మ‌హిళ‌లు ఉన్నారు.. ప‌లువురు మావోయిస్టులు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.. సంఘ‌ట‌నాస్థ‌లిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, ఇత‌ర వ‌స్తువుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుకు స‌మీపంలోని తెక్‌మేట అట‌వీ ప్రాంతంలో పెద్ద సంఖ్య‌లో మావోయిస్టులు స‌మావేశ‌మైన‌ట్లు పోలీసుల‌కు నిఘా వ‌ర్గాల నుంచి స‌మాచారం అందింది..దీంతో స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్, డీఆర్‌జీ ద‌ళాలు సంయుక్తంగా యాంటీ న‌క్స‌ల్ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి.. సోమ‌వారం రాత్రి నుంచే గాలింపు చేప‌ట్టి, మంగ‌ళ‌వారం ఉద‌యం మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు..పోలీసుల‌ను గ‌మ‌నించిన మావోయిస్టులు కాల్పులు జ‌రిపారు..బలగాలు ఎదురు కాల్పులకు దిగడంతో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు..సంబంధిత ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొన‌సాగుతోంది.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

5 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

6 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

10 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

1 day ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

1 day ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

1 day ago

This website uses cookies.