హైదరాబద్: హైదరాబాద్ లోని నాంపల్లి, బజారఘాట్ ఏరియాలో సోమవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది..అపార్టుమెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఓ గ్యారేజీ ఉన్నదని,,ఆ గ్యారేజీలో కారు(CNG)ను రిపేర్ చేస్తుండగా మంటలు చెలరేగాయని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు..గ్యారేజీలోనే డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటంతో వాటికి మంటలు అంటుకుని అపార్టుమెంటు పైఅంతస్థులకు ఆ మంటలు చెలరేగడంతో 9 మంది దుర్మరణం పాలయ్యారు..ఇందులో కొందరు ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా,, మరికొందరు సజీవ దహనమయ్యారు..మృతుల్లో 4 మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు..ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 8 మందిని గాంధీ ఆస్పత్రికి తరలించారు..మంటల్లో మరికొంత మంది చిక్కుకుని ఉన్నారని,,దింతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం..
అపార్టుమెంటు ముందు పార్క్ చేసి ఉన్న కార్లు, ద్విచక్రవాహనాలు కూడా ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయి.. స్థానికులు ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు..ఫైర్ సిబ్బంది నాలుగు ఫైరింజన్ ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు..అపార్టుమెంటులో చిక్కుకుని వున్న 15 మందిని,, రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.. అపార్టుమెంటు మూడు, నాలుగో ఫ్లోర్ లలో కొన్ని కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయని పోలీసులు తెలిపారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.