ప్రజాగాయకుడు గుమ్మడి విఠల్ రావు(గద్దర్) మృతి
హైదరాబాద్: ప్రజాగాయకుడు గుమ్మడి విఠల్ రావు (గద్దర్-74) కన్నుమూశారు..10 రోజుల క్రిందట గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన,, పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు..విప్లవ కవి గద్దర్ మెదక్ జిల్లా లోని తూప్రాన్ గ్రామంలో 1949లో లచ్చమ్మ, శేషయ్యలకు జన్మించారు..గద్దర్ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదివారు..అయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు..తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొంటూ తన పాటలతో చైతన్యం నింపారు. 1985లో గద్దర్ కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు..