అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ,మంగళవారం సాయంత్రానికి అదే ప్రాంతములో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలియచేశారు. క్రమంగా మరింత బలపడి డిసెంబర్ 7వ తేది సాయంత్రంకు నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి & ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ కు చేరుకుంటుందని తెలిపారు. డిసెంబర్ 8వ తేది ఉదయనికి తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు.తదుపరి 48 గంటల్లో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి & దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలువైపు కదులుతుందని వెల్లడించారు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- బుధ,,గురువారల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు,ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది.ఈదురు గాలులు (గంటకు 40 -50 కి మీ గరిష్టంగా 60 కి మీ వేగంతో)వీచే అవకాశం ఉంది.
రాయలసీమ:-బుధ,,గురువారల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు,ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.