అమరావతి: భారతదేశంలో లారీ డ్రైవర్లు శ్రమజీవులని, రోజుకు 12 నుంచి 14 గంటల పాటు స్టీరింగ్ ముందే కూర్చొని ఉంటారని, అలాంటి డ్రైవర్లకు సౌకర్యవంతంగా ఉండేలా ట్రక్కులో డ్రైవర్ క్యాబిన్లల్లో ఏ.సిలు ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆటో మొబైల్ కంపెనీలను కేంద్ర మంత్రి ఆదేశించారు.. సమావేశంలో మాట్లాడుతూ 2025 నుంచి అన్ని ట్రక్కుల్లో డ్రైవర్ క్యాబిన్ లలో తప్పనిసరిగా ఎయిర్ కండిషన్ అందుబాటులో ఉండాలని, ఈ మేరకు సోమవారం ఫైలుపై సంతకం చేయడం జరిగిందని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు..పలు కంపెనీలు తయారుచేసే అత్యాధునిక ట్రక్కులు ఇప్పటికే ఎయిర్ కండీషన్ క్యాబిన్లతో వస్తున్నాయని చెప్పారు..చాలా సంవత్సరాలుగా ఈ సమస్యపై చర్చ జరుగుతుందని, అయినా భారతదేశంలోని డ్రైవర్లు అప్ గ్రేడ్ కాలేదని అన్నారు..ట్రక్కు డ్రైవర్లు 43 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలో విధులు నిర్వహిస్తుంటారని, డ్రైవర్ క్యాబిన్ లో ఏసీ బిగించడం వల్ల డ్రైవర్లు మరింత సౌకర్యవంతంగా వాహనం నడుపుతారని మంత్రి చెప్పారు..లారీల్లో డ్రైవర్ క్యాబిన్ లో ఎయిర్ కండీషన్ అప్ గ్రేడ్ చేయడానికి సుమారు 18 నెలలు సమయం ఇవ్వటం జరిగిందని, అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని మంత్రి చెప్పారు. గడువు ముగిసిన తరువాత అన్ని ట్రక్కులోని డ్రైవర్ క్యాబిన్ లలో ఎయిర్ కండిషన్ తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనను అధికారుల సమక్షంలో ఆమోదించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
సీ.ఎస్,డీజీపీల సమావేశం:- అమరావతి: పోలింగ్ రోజు,,ఆటు తరువాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్లు డీజీపీ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ వద్ద ట్యాంకు క్లియర్ వాటర్ పంపింగ్ స్టేషన్ నుండి కొత్తూరుకు…
అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో…
నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
This website uses cookies.