నెల్లూరు:ప్రభుత్వ ఉద్యోగులందరూ రాజ్యాంగ స్ఫూర్తిని అందిపుచ్చుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కెవియన్ చక్రధర్ బాబు సూచించారు.శనివారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తోలుత ఉద్యోగులతో భారత రాజ్యాంగ పీఠిక లోని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య నియమాల మేరకు నడుచుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుతూ, ప్రజలoదరికీ సమాన అవకాశాలు లభించేవిధంగా ప్రతి ఉద్యోగి కృషి చేయాలన్నారు. ప్రజలకు సేవలందించే ప్రక్రియలో వచ్చే వివిధ రకాల సందేహాలను నివృత్తి చేసేవిధంగా రాజ్యాంగంలో పొందుపర్చారని వివరించారు. రాజ్యాంగంలోని ప్రతి అక్షరం అందరికీ శిరోధార్యమన్నారు. ఉద్యోగులందరు వ్యక్తిగత భాద్యతగా ప్రజలకు మంచి పరిపాలన అందించి ప్రజలకు చేరువయ్యే విధంగా కృషి చేయాలన్నారు. ప్రతి వ్యక్తి గౌరవాన్ని కాపాడేవిధంగా పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారిణి వెంకట నారాయణమ్మ, జిల్లా పంచాయతీ అధికారిణి ధనలక్ష్మి, ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఈ రంగ వర ప్రసాద్, డి సి ఓ తిరుపాల్ రెడ్డి, మెప్మా పిడి రవీంద్ర, హార్టికల్చర్ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.