నెల్లూరు: నగర పాలకసంస్థ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కమిషనర్ శ్రీమతి హరిత సమీక్షించారు. కమిషనర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు గురించి చర్చించారు. మంచినీటి ఎద్దడి నివారణకు అవసరమైన అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని కమిషనర్ అధికారులను సూచించారు. సమీక్షలో భాగంగా ఆర్ధిక సంఘం నిధుల పనుల అభివృద్ధి, పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, మన బడి నాడు- నేడు, సాధారణ నిధుల అభివృద్ధి పనులు, కమాండ్ కంట్రోల్ కేంద్రం నిర్మాణ పనులు, నగర వ్యాప్తంగా పచ్చదనం ఏర్పాటు వంటి వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు. అభివృద్ధి పనులన్నీ వేగవంతంగా పూర్తయేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటును అత్యంత ప్రాధాన్యతగా భావించి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు. అన్ని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులు సంపత్ కుమార్, సంజయ్, చంద్రయ్య, శేషగిరిరావు, సిబ్బంది పాల్గొన్నారు.
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
This website uses cookies.