NATIONAL

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీకి రాజీనామా చేసిన ఆనంద్ శర్మ

అమరావతి: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది..పార్టీని నడిపేందుకు సరైన నాయకత్వం లేకపోయిన,ఎదొవిధంగా నెట్టుకున్న వస్తున్న కాంగ్రెస్ పార్టీకి సొంత లీడర్స్ షాక్ లపై షాక్ లు ఇస్తున్నారు..ఇటీవల కాలంలో పలువురు కీలక నేతలు ఇప్పటికే బీజేపీ,,ఇతర పార్టీల్లో జాయిన్ అయ్యారు..ఈ నేపథ్యంలో తాజాగా హిమాచల్ ప్రదేశ్ శాఖ స్టీరింగ్ కమిటీ నాయకత్వానికి మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ రాజీనామా చేశారు..ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు..నా ఆత్మగౌరవంతో రాజీపడలేనని అందులో పేర్కొన్నారు..స్టీరింగ్ కమిటీ విధులు,బాధ్యతలపై స్పష్టతనివ్వాలని కోరారు..ఎన్నికల సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా తనను విస్మరించారని పేర్కొన్నట్లు సమాచారం..హిమచల్ ప్రదేశ్ లో మాత్రం పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు..కొద్ది రోజుల క్రితం జమ్మూ, కాశ్మీర్ లో ప్రచార కమిటీ, రాజకీయ వ్యవహారాల ప్యానెల్ ఛైర్మన్ పదవికి G23లో సభ్యుల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు..ఈ సంవత్సంర చివరిలో హిమాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి..ఇక్కడ బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది..ఇందులో బాగంగా మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభలో కాంగ్రెస్ ఉప నాయకుడైన ఆనంద్ శర్మను ఏప్రిల్ 26వ తేదీన హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ గా నియమితులయ్యారు.

 

 

 

 

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

13 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

15 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

18 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

19 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

23 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

2 days ago

This website uses cookies.