AMARAVATHI

ఏ చిన్న ఫిర్యాదు అందిన చాలా జాగ్రత్తగా పరిశీలించాలి-రోల్ అబ్జర్వర్ భాస్కర్

నెల్లూరు: రాజకీయ పక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఈసీ నిబంధనలు పాటించి పరిష్కరించాలని ఫోటో ఓటరు జాబితాల సంక్షిప్త సవరణ-2024 నెల్లూరు జిల్లా రోల్ అబ్జర్వర్ పి.భాస్కర్, అధికారులను ఆదేశించారు..శనివారంవారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణన్ తో కలసి , జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్ ఓ లు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, జిల్లాలో ఓటర్ల జాబితా సంక్షిప్త  సవరణ కార్యక్రమం పై సమీక్షించారు.

తొలుత జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణన్, జిల్లాలో చేపడుతున్నఫోటో ఓటరు జాబితాల సంక్షిప్త సవరణ-2024 వివరాలను తెలుపుతూ,  జిల్లాలో 4 రెవెన్యూ డివిజన్లు, 38 మండలాల పరిధిలో తిరుపతి పార్లమెంట్  నియోజకవర్గ పరిధిలో 1 అసెంబ్లీ నియోజక వర్గం, నెల్లూరు పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోక వర్గాలు మొత్తం 8 నియోజక వర్గాలు ఉన్నాయన్నారు. ఓటర్ల జాబితాల సవరణ షెడ్యూల్ ప్రకారం గత నెల 27 నాటికి ముసాయిదా జాబితాలు ప్రకటించడం జరిగిందన్నారు.. జిల్లాలో 2317 పోలింగ్ కేంద్రాలు గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. వాటిలో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ నెల 2, 3 తేదీల్లో కూడా స్పెషల్  కాంపెయిన్ నిర్వహించి క్లెయిమ్స్&అబ్జెక్షన్స్ అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.

రోల్ అబ్జర్వర్ పి.భాస్కర్ మాట్లాడుతూ,  ఎన్నికల సంవత్సరం కాబట్టి ఫోటో ఓటర్ల జాబితాల సంక్షిప్త సవరణపై ప్రత్యేక దృష్టి సారించాలనన్నారు.,వివిధ రాజకీయ పక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఈసీ నిబంధనలు పాటించి పరిష్కరించాలన్నారు. ఎక్కువగా ఫిర్యాదులు వచ్చిన నియోజకవర్గాలలో వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఏ చిన్న ఫిర్యాదు అందిన చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సరైన విధంగా పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్ల జాబితాలపై సూచనలు తెలియజేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

1 hour ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

17 hours ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

20 hours ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

21 hours ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

2 days ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

2 days ago

This website uses cookies.