నెల్లూరు: ఈ నెల 2, 3 తేదీలలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ M. హరినారాయణన్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్య్రమం రెండు రోజులు చేపడుతున్నామన్నారు. ఈ రెండు రోజులు సంబంధిత బూత్ స్థాయి అధికారులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ బూత్ లో ప్రజలకు అందుబాటులో ఉండి కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులు, మార్పులు చేర్పులకు సంబంధించి 6, 7, 8 ఫారాలను అందించడంతోపాటు పూర్తిచేసిన ఫారాలను కూడా స్వీకరిస్తారన్నారు.18 సంవత్సరాలు పైబడిన వారు ఓటర్లుగా కొత్తగా పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. ఇదివరకే ఓటర్ కార్డు కలిగిన వారు చేర్పులు, మార్పుల కోసం కూడా బూత్ స్థాయి అధికారులను సంప్రదించవచ్చన్నారు. ఓటర్లు వారి పేర్లు ఓటర్ల జాబితాలో నమోదైనది లేనిది పరిశీలించు కోవచ్చన్నారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న ఈ ఓటర్ల నమోదు ప్రత్యేక కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.