నెల్లూరు: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లక్ష రూపాయలు దాటిన నగదు లావాదేవీలపై బ్యాంక్ అధికారులు నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్,ఎన్నికల అధికారి నారాయణన్ అన్నారు. మంగళవారం ఎన్నికల సందర్భంగా బ్యాంకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసిన నాటినుండి తరచుగా వారి ఖాతాలను పరిశీలించాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల అభ్యర్థులకు కొత్త బ్యాంక్ ఖాతాలను ప్రారంభించాలన్నారు. అలాగే 10 లక్షల రూపాయలపై బ్యాంకుల్లో జరిగిన లావాదేవీలపై జిల్లా ఎన్నికల అధికారికి నివేదికలు ఇవ్వాలన్నారు.ఒకే ఖాతా నుండి పలుసార్లు నగదు లావాదేవీలు జరిగిన ఖాతాలను పరిశీలించాలన్నారు. బ్యాంకుల నుండి ఏ.టీ.ఎం కు రవాణా చేసే నగదు వాహనాల కు క్యూఆర్ కోడ్ ఇవ్వాలన్నారు. అనుమానస్పద లావాదేవిలపై బ్యాంకు అధికారులు ప్రతిరోజు నివేదిక ఇవ్వాలని ఆయన అన్నారు.ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రదీప్, ఎన్నికల ఖర్చు మానిటరింగ్ నోడల్ ఆఫీసర్ విద్యాసాగర్, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
This website uses cookies.