తెలంగాణలో మీ వెనుక నడించేందుకు జనసైనికులు సిద్దం..
హైదరాబద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పొత్తులు,సమీకరణలు వేగంగా మారుతున్నాయి..ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రతి ఓటును ఒడిసిపట్టేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది..ఈ నేపధ్యంలో ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షమైన జనసేన పార్టీ మద్దతుతో తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగేందుకు బీజేపీ సిద్ధమౌతోంది..
ఈ క్రమంలో బుధవారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి,,రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశం అయ్యారు..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ను వారు కోరినట్లు సమాచారం..ఇందుకు పవన్ కల్యాణ్ వెంటనే నిర్ణయం ప్రకటించకుండా,,పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలిసింది..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 చోట్ల పోటీ చేయనున్నఅభ్యర్థుల జాబితానుసైతం వెల్లడించింది.. మంగళవారం తెలంగాణ జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు..ఈ సందర్బంలో తెలంగాణ జనసేన పార్టీ నాయకులు వారి అభిప్రాయంలను తెలియచేస్తు,,ఈ సారి ఖచ్చితంగా ఎన్నికల బరిలో నిలవాలని,, లేకుంటే రాబోయే రోజుల్లో పార్టీ ఎదుగుదలకు ఇబ్బందులు ఎదురవుతాయని పవన్ దృష్టికి తీసుకెళ్లారు..పవన్ కల్యాణ్ సైతం వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు..తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ,, జనసేన కలిసి ఎన్నికల బరిలోకి దిగితే ఇప్పటికే జనసేన ప్రకటించిన నియోజకవర్గాల్లో మార్పులు చోటుచేసుకుంటాయా? అలాగే ఒక వేళ కలసి ఎన్నికల బరిలో దిగాలి అనుకుంటే ? సీట్ల సర్దుబాట్లు ఎలా వుంటాయి ? అభ్యర్దుల ఖరారు? ప్రచార సరళి ? అనే విషయాలు ఏ రూపును సంతరించుకుటాయో అనేది వేచి చూడాలి.?
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.